గ్రామాల్లో ఇతరులను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడొద్దని ఎస్ఐ శ్రీనివాసులు గురువారం పేర్కొన్నారు. పెద్దవడుగూరు, మిడుతూరు, చిన్న వడుగూరులో పోలీసులు కవాతు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన ఆయా గ్రామాల్లో ప్రజలతో మాట్లాడారు. ప్రజలు అందరూ ప్రశాంతంగా జీవించాలన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఎన్నికోడ్ అమల్లో ఉందని, ఉల్లఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.