రాష్ట్రంలో నాలుగు లోక్సభ స్థానాల్లో వైయస్ఆర్సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. వరుసగా మూడుసార్లు ఎంపీలుగా ఎన్నికై వైయస్ అవినాష్రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్రెడ్డి హ్యాట్రిక్ సాధించారు. కడప పార్లమెంటరీ స్థానంలో ఈవీఎం, పోస్టల్ బ్యాలెట్ ద్వారా 12,97,362 ఓట్లు పోలయ్యాయి. వైయస్ అవినాష్రెడ్డికి 5,97,101 ఓట్లు లభించగా, టీడీపీ అభ్యర్థి భూపేష్రెడ్డికి 5,31,611 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి షర్మిలకు 1,35,731 ఓట్లు వచ్చాయి. అవినాష్రెడ్డి తన సమీప ప్రత్యర్థి భూపేష్రెడ్డిపై 65,490 ఓట్ల ఆధిక్యతతో గెలుపొంది తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. బద్వేలు, పులివెందుల నియోజకవర్గాలు మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో భూపేష్ ఆధిక్యత సాధించారు.