ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబుతోనే రాష్ట్రానికి మేలు జరుగుతుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 05, 2024, 06:19 PM

వైఎస్‌ జగన అనే మదమెక్కిన ఏనుగును టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నూలుపోగుతో బంధించారని టీడీపీ కూటమి ఎంపీ అభ్యర్థి పార్థసారథి సతీమణి బీకే కమలమ్మ విమర్శించారు. ఈ ఎన్నికల ఫలితాలే జగనకు గుణపాఠమన్నారు. ఆమె పెనుకొండలో మంగ ళవారం మాట్లాడుతూ... ప్రస్తుతం వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో చంద్రబాబు సారథ్యంలో టీడీపీ కూటమి జిల్లాను క్లీనస్వీప్‌ చేసిందన్నారు. జగన్మోహనరెడ్డి అహంకారం, మదంతోనే ప్రజలు ఇటువంటి తీర్పు ఇచ్చారన్నా రు. చంద్రబాబుతోనే రాష్ట్రానికి, ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. రొద్దం మండల వ్యాప్తంగా టీడీపీ గెలుపుపై నాయకులు, కార్యకర్తలు ఆయా గ్రామా ల్లో బాణసంచా పేల్చుతూ కేక్‌కట్‌చేసి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్ర మంలో తెలుగు మహిళలు సుబ్బరత్నమ్మ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com