ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సియస్ ని కలిసిన ఏబీ వెంకటేశ్వరరావు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 30, 2024, 07:46 PM

ఏపీ హైకోర్టు  ఇచ్చిన ఉత్తర్వులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని సీనియర్ పోలీసు అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఈ రోజు (గురువారం) కలిశారు. క్యాట్ ఉత్తర్వుల ప్రకారం ఏబీ వెంకటేశ్వరరావుకి పోస్టింగ్ ఇచ్చి, జీత భత్యాలను ప్రభుత్వం చెల్లించాలని ధర్మాసనం ఆదేశించింది. ఏబీ వెంకటేశ్వరరావు శుక్రవారం పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఆయనకు పోస్టింగ్ ఇవ్వాలని పెద్ద ఎత్తున నెటిజన్లు కూడా డిమాండ్ చేస్తున్నారు. దాంతో హైకోర్టు తీర్పు కాపీని, క్యాట్ ఉత్తర్వులను పరిశీలించి తనకు వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని ఏబీ వెంకటేశ్వరరావు సీఎస్‌ను కోరారు. తాను ఈ విషయాన్ని పరిశీలిస్తానని సీఎస్ జవహర్ రెడ్డి ఏబీ వెంకటేశ్వరరావుకి తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com