ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అన్నవరం రైల్వే స్టేషన్‌లో గంటన్నర హైడ్రామా.. ప్రయాణికుల కేకలు, ఏమైందంటే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 21, 2024, 08:34 PM

కాకినా జిల్లా అన్నవరం రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు కొద్దిసేపు టెన్షన్ పడ్డారు. సాంకేతిక సమస్యతో లిఫ్ట్ ఆగిపోవడంతో.. పలువురు ప్రయాణికులు అంతులో ఇరుక్కుపోయారు. అన్నవరం సత్యదేవుడి దర్శనానికి విజయవాడకు చెందిన ఏడుగురు భక్తులు వచ్చారు.. స్వామివారిని దర్శించుకుని తిరిగి విజయవాడకు పయనమయ్యారు. ఈ క్రమంలో వీరంతా సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో.. అన్నవరం రైల్వే స్టేషన్‌కు వచ్చారు. అక్కడ రైలు ఎక్కేందుకు మూడో నంబరు ప్లాట్‌ఫాం నుంచి లిఫ్ట్‌లో ఫుట్ ఓవర్ బ్రిడ్జికు వెళ్తున్న సమయంలో లిఫ్ట్‌లో సాంకేతిక సమస్య వచ్చింది.


లిఫ్ట్ ఒక్కసారిగా ఆగిపోవడంతో ప్రయాణికులు పెద్దగా కేకలు వేశారు. ఆ లిఫ్ట్‌ ఎంతకీ తెరుచుకోక పోవడంతో ప్రయాణికులు కొద్దిసేపు టెన్షన్ పడ్డారు. అక్కడ పరిస్థితిని గమనించిన రైల్వే అధికారులు వెంటనే అప్రమత్తం అయ్యారు. వారు జీఆర్పీ, రైల్వే ఎలక్ట్రిక్ డిపార్ట్‌మెంట్ అధికారులకు సమాచారం ఇవ్వగా.. వారు లిఫ్ట్‌ పై భాగంలో ఉన్న ఖాళీ భాగాన్ని తెరచి, నిచ్చెన వేసి ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దాదాపు గంటన్నర పాటు ప్రయాణికులు లిఫ్ట్‌‌లో ఉన్నట్లు తెలుస్తోంది. లిఫ్ట్ కొద్దిసేపు మాత్రమే నిలిచిపోయిందని అన్నవరం రైల్వే స్టేషన్‌ సూపరింటెండెంట్‌ తెలిపారు. లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చామని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com