ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జూన్ 19 వరకూ జాగ్రత్త వహించండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 17, 2024, 06:34 PM

ఏపీ ఎన్నికల్లోనూ.. అవి ముగిసిన తర్వాత జరిగిన అల్లర్లు అన్నీ ఇన్నీ కావు. కొన్ని చోట్ల రక్తం ఏరులై పారింది. మహిళలు.. కనీసం గర్భిణులని కూడా చూడకుండా దాడులు చేశారు. పురుషుల తలలు పగులగొట్టారు. ఆసుపత్రుల్లోకి వెళ్లి మరీ రోగులపై దాడులు చేశారు. అయితే ఇవి ఇప్పటితో ముగిసేవి కావని.. ఫలితాలు వెలువడిని తర్వాత కూడా కంటిన్యూ అవుతాయని నిఘా విభాగం హెచ్చరిస్తోంది. ఏపీకి నిఘా విభాగం హెచ్చరికలు జారీ చేసింది. ఎన్నికల ఫలితాల తర్వాత ప్రతీకార దాడులకు అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చింది. జూన్ 19 వరకూ పోలీసు బలగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అవసరమైతే కేంద్ర బలగాలను మోహరించాలని ఇంటెలిజెన్స్ తెలిపింది. ఈ మేరకు జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లకు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. పల్నాడు, అనంతపురం, చిత్తూరు, తిరుపతి, కడప, కర్నూల్ జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. ఘర్షణలు జరిగే ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 25 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను ఫలితాల తర్వాత 2 వారాల వరకూ కొనసాగించాలని హోంశాఖకు కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com