ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పలువురు కలెక్టర్ లకి స్థానచలనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 17, 2024, 06:32 PM

ఏపీ సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ ముగిసిన తర్వాత రాష్ట్రంలో పలు ఘర్షణలు, అల్లర్లు నెలకొన్నాయి. దీంతో కేంద్ర ఎన్నికల కమిషన్  చర్యలు చేపట్టింది. ఈ మేరకు పల్నాడు కలెక్టర్, పలు జిల్లాల ఎస్పీలపై చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు పడింది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పల్నాడు కలెక్టర్ శివశంకర్‌ను ఏపీ ప్రభుత్వం శుక్రవారం బదిలీ చేసింది. ఆయనను జీఏడీలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పల్నాడు జాయింట్ కలెక్టర్‌కు బాధ్యతలు అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. పల్నాడు కలెక్టర్‌తో పాటు తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పాటిల్‌ను బదిలీ చేస్తూ ఏపీ సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కృష్ణకాంత్‌ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com