ఏపీలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మళ్ళీ జగన్ లాంటి ముఖ్యమంత్రి రావొద్దని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ప్రజలు గొడ్డలి తీసుకోవాల్సిన అవసరం లేదని.. ఓటుతో జగన్కు సమాధానం చెప్పాలన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యం చేయలేని విధంగా ప్రజలు ఓట్లు వేయనుని కోరారు. ఏపీలో ప్రజలు సైలెంట్ ఓటు వేయనున్నారన్నారు. జగన్ నుంచి ప్రజలు విముక్తి, భూములు కాపాడుకోవాలంటే ఎన్డీఏ కూటమిని, చంద్రబాబును సీఎంగా గెలిపించాలని కోరారు.