ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గెలిచిన 100 రోజుల్లో విశాఖపట్నం అభివృద్ధి చేస్తా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 09, 2024, 05:23 PM

కూటమికి ఓటు వేస్తే బీజేపీని గెలిపించినట్టే అని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏపాల్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ..  బీసీ, దళిత, క్రైస్తవులు, ముస్లిం లు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏడు నియోజకవర్గాల్లో ప్రజాశాంతి పార్టీకి స్పందన అద్భుతంగా ఉందన్నారు. టీడీపీ ఎంపీ శ్రీభరత్ బీజేపీతో పొత్తు కారణంగా క్రిస్టియన్, మైనార్టీ ఓట్లు దూరమవుతాయన్నారు.విశాఖ నుంచి ఎంపీగా కేఏ పాల్‌ను పంపిద్దామని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. తాను గెలిస్తే ఎన్నికల్లో ఓట్లు వేయని వారిపై చర్యలు తీసుకునేలా చట్టం తీసుకొస్తానన్నారు. మోదీని ఢీకొట్టలేక... జగన్, చంద్రబాబు, పవన్ దాసోహం అయ్యారని విమర్శించారు.  సర్వే ప్రకారం ఎంపీగా 5 లక్షల మెజారిటీతో తాను గెలవాలని భావిస్తున్నట్లు తెలిపారు. తాను గెలిస్తే 100 రోజుల్లో విశాఖపట్నం అభివృద్ధి చేస్తానని కేఏపాల్ ధీమా వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com