పులివెందులలో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు నిందితులో గురువారం సీబీఐ కోర్టును ఆశ్రయించారు. నిందితులుగా ఉన్న భాస్కర్ రెడ్డి, దేవి రెడ్డి శివ శంకర్ రెడ్డి ఏపీ సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. ఇప్పటికే వివేకా కేసులో వీరికి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఏపీలోకి వెళ్లాలంటే ట్రయిల్ కోర్ట్ లో అనుమతి తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు షరతు విధించింది. దీంతో నిందితులు సీబీఐ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై కోర్టు శుక్రవారం(మే 10) విచారణ జరపనుంది.