ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు యత్నిస్తున్నారు నేతలు. నగదు, మద్యం, చీరలు, రకరకాల వస్తువులను ఇచ్చి ఓటర్లను తమవైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇలాంటి వాటికి చెక్పెట్టేందుకు ఈసీ, పోలీసులు కూడా రంగంలోకి దిగారు. ఇలాంటి ప్రలోభాలను అడ్డుకునేందుకు ఈసీ, పోలీసులతో కలిసి అన్ని రకాల చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఎన్నికల అక్రమాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు ‘సీ విజిల్’ యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చిన ఈసీ.. ఎన్నికల్లో అక్రమాలపై నేరుగా ఈయాప్లో ఫిర్యాదు చేసే అవకాశం కల్పించింది.