నిరుద్యోగులను సీఎం జగన్ మోసం చేశారని షర్మిల విమర్శించారు. "ప్రతి సంక్రాంతికి జాబ్ క్యాలెండర్ వేస్తామన్నారు. సంక్రాతులు వచ్చాయి.. వెళ్లాయి. జాబ్ క్యాలెండర్ మాత్రం ఒక్కటీ రాలేదు. ఉద్యోగ నోటిఫికేష్ల కోసం యువత వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. మెగా డీఎస్సీ వేస్తామని చెప్పిన జగన్.. చివర్లో ఓ దగా డీఎస్సీ తెచ్చి నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారు." అని చింతలపూడి సభలో షర్మిల మండిపడ్డారు.