ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనసేన పార్టీ మహిళా అభ్యర్థి ఆస్తులు ఏకంగా రూ.894 కోట్లు.. ఆ ఒక్క కంపెనీ విలువే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 20, 2024, 09:03 PM

ఏపీలో ఎన్నికల సందడి కనిపిస్తోంది.. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. అలాగే అఫిడవిట్‌లో తమ ఆస్తులు, కేసుల వివరాలను కూడా పొందుపరుస్తున్నారు. అయితే విజయనగరం జిల్లా నెల్లిమర్ల జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న లోకం మాధవి ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి. మాధవి ఆస్తుల విలువ రూ.894.92 కోట్లు కాగా.. వీటిలో మిరాకిల్‌ పేరుతో సాఫ్ట్‌వేర్‌ కంపెనీ, విద్యా సంస్థలు, భూములు, ఆభరణాలు, నగదు, బ్యాంకు డిపాజిట్స్‌ వంటివి ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ కంపెనీ విలువు ఎక్కువ ఉందంటున్నారు. బ్యాంకు అకౌంట్‌లో రూ.4.42 కోట్లు, నగదు రూపంలో రూ.1.15 లక్షలు ఉంది. చర ఆస్తులు రూ.856.57 కోట్లు కాగా.. స్థిరాస్తులు రూ.15.70 కోట్లు. అప్పులు రూ.2.69 కోట్లు ఉన్నాయి.


విజయనగరం జిల్లా చీపురుపల్లి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ ఆస్తి ఐదేళ్లలో దాదాపు రెండున్నర రెట్లు పెరిగింది. మంత్రి పేరిట చరాస్తులు రూ.3.78 కోట్లు.. ఆయన భార్య ఝాన్సీలక్ష్మి పేరిట చరాస్తి రూ.4.75 కోట్లు. హెచ్‌యూఎఫ్‌ రూ.35.04 లక్షలు ఉంది. స్థిరాస్తుల పరంగా బొత్స పేరిట రూ.6.75 కోట్లు, ఝాన్సీ పేరుతో రూ.4.46 కోట్లు, కుటుంబ సభ్యుల పేరిట రూ.1.08 కోట్ల విలువైనవి ఉన్నాయి. మొత్తం చర, స్థిరాస్తుల విలువ రూ.21.19 కోట్లు. 2019 అఫిడవిట్‌ ప్రకారం రూ.8.23 కోట్లు మాత్రమే. మంత్రికి రూ.15.95 లక్షల విలువైన కారు, ఝాన్సీకి రెండు కార్లు (రూ.73.33 లక్షలు, రూ.8 లక్షలు) ఉన్నాయి. బొత్స వద్ద రూ.20.15 లక్షల విలువైన 31 తులాల బంగారం, ఝాన్సీలక్ష్మి వద్ద రూ.2.11 కోట్ల విలువైన 325 తులాల బంగారముంది. అప్పులు రూ.4.24 కోట్లు ఉండగా, ఎక్కువగా కుటుంబ సభ్యుల నుంచి తీసుకున్నవే. వీరిపై కేసుల్లేవు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com