ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భార్యపై అనుమానంతో భర్త దారుణం.. తల్లీపిల్లలను ఇంట్లో ఉంచి.. అసలు మనిషేనా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 20, 2024, 08:00 PM

ఏలూరు జిల్లా భీమడోలులో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న భర్త.. దారుణానికి ఒడిగట్టాడు. భార్యను, పిల్లలను ఇంట్లో ఉంచి.. ఇంటికి నిప్పుపెట్టాడు. అయితే అదృష్టవశాత్తూ వారు బతికి బయటపడ్డారు. తలుపులు పగలగొట్టుకుని బయటకు వచ్చారు. ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించి.. భర్త మీద ఫిర్యాదు చేసింది బాధితురాలు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అర్జావారిగూడెనికి చెందిన ఓ వ్యక్తికి.. ఓ యువతితో 2009లో పెళ్లైంది. వివాహం జరిగి సుమారు 15 ఏళ్లు కాగా.. వారికి ఇద్దరు పిల్లలు. అయితే ఈ మధ్యకాలంలో నిందితుడు భార్య మీద అనుమానం పెంచుకున్నాడు. తరుచుగా ఆమెను వేధించడం మొదలెట్టాడు. ఈ మధ్యకాలంలో అతని వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. గత కొన్ని రోజులుగా బాధితురాలి పట్ల కర్కశంగా వ్యవహరించడం మొదలెట్టాడు.


ఈ క్రమంలోనే భార్యను, ఇద్దరు పిల్లలను ఇంటిలో ఉంచిన నిందితుడు బయట నుంచి గడియ పెట్టాడు. అనంతరం ఇంటికి నిప్పుపెట్టాడు. అయితే అదృష్ణం బాగుండి ఆ తల్లీపిల్లలు ప్రాణాలతో బయటపడ్డారు. తలుపులు బద్ధలు కొట్టుకుని అక్కడి నుంచి బయటపడ్డారు. అనంతరం బాధితురాలు భీమడోలు పోలీసులను ఆశ్రయించారు. అనుమానంతో తన భర్త తనను, తన పిల్లలను చంపేందుకు యత్నించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు మొదలెట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com