టిడిపి , జనసేన పార్టీకి చెందిన 100 కుటుంబాలు శుక్రవారం రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు సమక్షంలో వైసీపీలో చేరారు. రేపల్లె రూరల్ మండలం పేటేరు గ్రామ వైసిపి ఇన్చార్జి కనపర్తి రవికిరణ్ , రేపల్లె మండల వైస్ ఎంపీపీ నెహ్రూ లక్ష్మీ ప్రభాకర్ రావు నాయకత్వంలో టిడిపి , జనసేన పార్టీలను వీడి వైసీపీలో చేరారు. వీరికి ఎంపీ మోపిదేవి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.