రాష్ట్రంలో లోక్సభ, శాసనసభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజే గురువారం భారీ ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. దశమి, గురువారం మంచిరోజు కావడంతో తొలిరోజునే అభ్యర్థులు భారీ ర్యాలీలతో వెళ్లి నామినేషన్లు దాఖలు చేశారు. 25 లోక్సభ స్థానాలకు 39 మంది అభ్యర్థులు 43 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రత్యేక పూజలు, ప్రార్థనల అనంతరం భారీ ర్యాలీలతో బయల్దేరి ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. శుక్రవారం తిరుపతి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తి నామినేషన్ వేశారు. వైయస్ఆర్ సీపీ అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమానికి పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.