పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన విజయనగరం జిల్లా, బాడంగి మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే.... మండలంలో చినభీమవరం గ్రామానికి చెందిన ఉయ్యాల నూకందొర (51) మద్యం, పేకాటకు బానిసై గ్రామంలో రూ.3 లక్షల వరకు అప్పు చేశాడు. అప్పుల భారం పెరగడం, అప్పు తీర్చేందుకు అవకాశం లేకపోవ డంతో ఈ నెల 16న ఉదయం పురుగుల మందు తాగి ఇంటికి వచ్చి వాంతులు చేసుకు న్నాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు నూకందొరను స్థానిక పీహెచ్సీకి తరలించ గా అక్కడి నుంచి ప్రఽథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయ నగరం సర్వజన ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ 17వ తేదీ రాత్రి మృతిచెందాడు. దీనిపై మృతుడి భార్య పద్మావతి ఫిర్యాదు మేరకు గురువా రం కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.