టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి పెనమలూరు అభ్యర్థి బోడె ప్రసాద్ శుక్రవారం తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. పోరంకి టీడీపీ కార్యాలయం నుంచి ఉదయం తొమ్మిది గంటలకు పాదయాత్రగా బయలుదేరి పెనమలూరు తహసీల్దారు కార్యాలయంలో తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. కార్యక్రమానికి అభిమానులు, కూటమి నేతలు, పార్టీల శ్రేణులు కావాలని బోడె ప్రసాద్ పిలుపునిచ్చారు. నామినేషన్ కార్యక్రమానికి కూటమి ఎంపీ అభ్యర్థి బాలశౌరి, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, వైవీబీ రాజేంద్రప్రసాద్, బుద్దా వెంకన్న, కొలుసు పార్థసారథి, ముప్పా రాజా, ఏకుల విజయేంద్ర హాజరవుతారని తెలిపారు.