పత్తికొండ నియోజకవర్గం వైసిపి అభ్యర్థిగా కంగాటి శ్రీదేవి శుక్రవారం నామినేషన్ వేయడానికి భారీ ర్యాలీతో తరలి వెళ్లారు. ర్యాలీ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుండి ప్రారంభమై నాలుగు స్తంభాల మంటపం వరకు సాగింది. అనంతరం రెవెన్యూ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. పత్తికొండ, తుగ్గలి, మద్దికెర, కృష్ణగిరి, వెల్దుర్తి మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.