పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళిపై చర్యలకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అంబటి మురళిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను ఎన్నికల కమిషన్ ఆదేశించింది. పొన్నూరు మండలం ములుకుదురులో ఆయన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ విషయమై సీఈవో ముకేశ్కుమార్ మీనాకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన అధికారులు అంబటి మురళి ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు అధికారులు నిర్ధారించారు. అంబటి మురళిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఆదేశాలు అందాయి.