రాయదుర్గంలో బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నట్లు చిందనూరు నాగరాజు శుక్రవారం తెలిపారు. ఉదయం 11: 30 గంటలకు వినాయక సర్కిల్ నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. బీఎస్పీ నాయకులు, కార్య కర్తలు, అభిమానులు పాల్గొని ఆశీర్వదించాలని కోరారు.