ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎంపై దాడి జరిగితే అవహేళనగా మాట్లాడతారా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 19, 2024, 12:25 PM

జూన్‌ 4 తర్వాత టీడీపీ, జనసేన అడ్రస్‌ గల్లంతు ఖాయమ‌ని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి  జోగి రమేష్ పేర్కొన్నారు. మంత్రి జోగి ర‌మేష్ మీడియాతో మాట్లాడుతూ....  సీఎంపై దాడి జరిగితే అవహేళనగా మాట్లాడతారా? విజయవాడ నడిబొడ్డున ముఖ్యమంత్రి గారిపై దాడి జరిగితే, ఆ దాడి ఒక డ్రామా అని, పథకం ప్రకారం చేశారని చంద్రబాబు, లోకేష్ లు సిగ్గు లేకుండా మాట్లాడతారా?.  సంస్కార హీనంగా అవహేళన చేస్తారా? మీరు అసలు మనుషులేనా? ముఖ్యమంత్రి గారిపై జరిగిన దాడి ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి. ఇది ఐదు కోట్ల మంది ప్రజలపై జరిగిన దాడి. మరీ ముఖ్యంగా ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ, ఇతర వర్గాల పేదలపై జరిగిన దాడిగా ప్రజలంతా చూస్తున్నారు. పేదలకు నేనున్నాను... మీకు అండగా ఉంటాను.. అంటూ ప్రతి గడపనూ ఆదుకున్న మనసున్న ముఖ్యమంత్రి జగనన్నపై జరిగిన దాడిని నరరూప రాక్షసులైన నారా చంద్రబాబు, ఆయన దత్త పుత్రుడు పవన్‌ కల్యాణ్‌ అవహేళన చేశారు. వీళ్లు విలువలు, విశ్వసనీయత లేని రాజకీయ అజ్ఞానులు.  ఆ బలమైన రాయి కొంచెం కింద కంటికి తగిలి ఉంటే కన్ను పోయేది. అదే కణతకి తగిలి ఉంటే ప్రాణమే పోయేది.  ఇలాంటి కోల్డ్ బ్లడెడ్ హత్యలకు పురిగొల్పిన చంద్రబాబు అండ్‌ కో.. ఈ రోజు ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. ఎవరు దాడి చేశారు.. దాడి చేసిన వారి వెనుక ఎవరున్నారు అనేది మొత్తం పోలీసుల విచారణలో బయటకు వస్తుంది.  ముందుగానే చంద్రబాబు భుజాలు తడుముకోవడం దేనికీ?  కుట్ర కోణమంతా బయటకు వస్తుంది.. చంద్రబాబు కాస్త వెయిట్‌ చేయాలి.  అంత సంఘటన జరిగినా... దేవుడి దీవెనలు, ప్రజల ఆశీస్సులు జగనన్నకు మెండుగా ఉన్నాయి కనుక ప్రాణాపాయం తప్పింది.  ఆయనకు తలకు గాయమైందని తెలియగానే కోట్లాది మంది ప్రజలు ప్రార్ధనలు చేశారు.  జగనన్నపై ప్రేమ ప్రతి గడపలో కనిపించింది అని అన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com