ఈ నెల 13న విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్పై రాయి దాడి జరిగింది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని ఈరోజు విజయవాడ కోర్టులో హాజరుపరచగా... న్యాయమూర్తి నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించారు. మే 2వ తేదీ వరకు రిమాండ్ విధిస్తున్నట్లు విజయవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి తెలిపారు.