ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజోలులో జనసేన పార్టీకి బిగ్ షాక్.. మళ్లీ వైసీపీలోకి వెళుతున్న కీలక నేత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 18, 2024, 07:49 PM

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో జనసేన పార్టీకి మరో నేత షాకిచ్చారు. జనసేన పార్టీకి రాజోలు నియోజకవర్గ ఇంఛార్జ్ బొంతు రాజేశ్వరరావు రాజీనామా చేశారు. రాజేశ్వరరావుతో పాటు జనసేన సర్పంచ్ కాకర శ్రీనివాస్, ఇతర ముఖ్య నాయకులు గుడ్ బై చెప్పారు. రాజేశ్వరరావుతో పాటుగా జనసేన నేతలంతా ఇవాళ తణుకులో‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరనున్నారు.


బొంతు రాజేశ్వరరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇరిగేషన్ ఇంజనీర్ ఇన్ చీఫ్‌గా పనిచేశారు.. వైఎస్‌ రాజశేఖర్ రెడ్డికి సన్నిహితుడిగా చెబుతుంటారు. ఆ తర్వాత ఆయన వైఎస్సార్‌సీపీలో చేరగా.. రాజోలు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండుసార్లు పోటీచేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో రాజోలు నుంచి జనసేన తరపున గెలిచిన రాపాక వరప్రసాదరావుపై కేవలం 800 ఓట్ల తేడాతో బొంతు రాజేశ్వరరావు ఓడారు. జనసేన పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌‌ వైఎస్సార్‌సీపీకి మద్దతు ఇచ్చారు.


అప్పటి నుంచి రాపాకకు ప్రాధాన్యం ఇవ్వడంతో బొంతు వర్గీయులు ఆగ్రహంతో ఉన్నారు. ఆయన ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసి.. అనుచరులతో కలిసి జనసేన పార్టీలో చేరారు. బొంతు రాజేశ్వరరావు జనసేన పార్టీ తరఫున రాజోలు టికెట్ ఆశించారు. కానీ రిటైర్డ్ ఐఏఎస్ దేవ వరప్రసాద్‌కు టికెట్ కేటాయించడంతో బొంతు రాజేశ్వరరావు జనసేన పార్టీకి రాజీనామా చేశారు. మళ్లీ వైఎస్సార్‌సీపీలోకి వెళుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com