సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మడకశిర పట్టణానికి రానున్నారు. ఈ సందర్భంగా గురువారం మడకశిర పట్టణంలో జరిగే భారీ బహిరంగ సభకు హిందూపురం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి సమద్ షాహిన్ ఆధ్వర్యంలో బహిరంగ సభకు వాహనాల్లో హిందూపురం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు.