జనసేన, తెలుగుదేశం పార్టీలతో పాటు వాణిజ్య సంఘాలకు చెందిన కీలక నేతలు వైయస్ఆర్ సీపీలో చేరారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా తేతలిలో నైట్ స్టే పాయింట్ వద్ద వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో తాడేపల్లి గూడెంకు చెందిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏపీ కన్వీనర్ గమ్మిని సుబ్బారావు వైయస్ఆర్ సీపీలో చేరారు. ఈ మేరకు సీఎం వైయస్ జగన్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.