నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉండే తహసీల్దార్ కార్యాలయానికి కనీసం వంద మీటర్ల దూరంలో ర్యాలీలు నిలిపివేయాలి. అభ్య ర్థితో పా టు మరో నలుగురిని మాత్రమే అనుమతిస్తారు. నామినేషన్ దాఖలు చేయడానికి 48 గంటల ముందు అభ్యర్థులు తప్పనిసరిగా వారి పేరిట ఏదైనా గుర్తింపు పొందిన బ్యాంకులో ఖాతా తెర వాలి. ఆ ఖాతా ద్వారానే ఎన్నికల ప్రచారానికి, ఇతర అవసరాలకు వెచ్చించిన సొమ్ముకు సంబంధించిన లావాదేవీలు నిర్వహిం చాలి. ఖాతా పుస్తకం ప్రతిని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఇవ్వాలి. విద్యార్హతలు, నేర చరిత్ర, ఆస్తులు, అప్పులకు సంబంధించిన పత్రాలు అందించాలి. నేర చరిత్ర కలిగి, కోర్టుల్లో కేసులు ఉన్నవారు నేర వివరాల సంఖ్యను ప్రస్తావించాలి. పార్లమెంటు అభ్యర్థులు జిల్లా కేంద్రాల్లో నామినేషన్లు సమర్పించాలి. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ప్రభుత్వ ఉద్యోగి తన ఉద్యోగానికి రాజీనామా చేయాలి. రాజీనామాను ఆమోదించినట్లు ప్రభు త్వం జారీ చేసిన ధ్రువీకరణ పత్రాన్ని నామినేషన్తో పాటు దాఖలు చేయాలి. అభ్యర్థులు ఇంటి, నీటి పన్ను, విద్యుత్ చార్జీల బిల్లు బకాయిలు లేనట్లు ధ్రువీకరణ పత్రాలు అందజేయాలి.