ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పట్టు వస్త్రాలకి గుర్తింపు తెప్పిస్తా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 18, 2024, 01:14 PM

మదనపల్లె పట్ట ణంలోని నీరుగట్టువారిపల్లెలో తయారయ్యే పట్టు వస్త్రాలకి అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి దక్కేటట్టు కృషి చే స్తానని రాజంపేట ఎన్డీఏ ఎంపీ అభ్య ర్థి నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ పట్టు ఉత్పత్తుల నిపు ణురాలు ప్రస్తుతం అమెరికాలో పని చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. అంతర్జాతీయంగా ఎగుమతులు సాధిస్తే నీరుగట్టువారిపల్లె పట్టుకు మంచి ఖ్యాతి లభిస్తుం దన్నారు. నీరుగట్టువారిపల్లె చేనేత సంఘ నాయకుడు, వైసీపీ చేనేత విభాగం డివిజనల్‌ కోఆర్డి నేటర్‌ భువనేశ్వరి సత్య ఆధ్వర్యంలో 200 మందికిపైగా నేతన్నలు బుధవారం కలికిరిలో కిరణ్‌కుమార్‌ రెడ్డి సమక్షంలో బీజేపీ కండువాలు కప్పుకుని పార్టీలో చేరారరు. ఈ సందర్భంగా ఆయన్డ మాట్లాడుతూ కండలేరు పథకం దురదృష్టవశాత్తు మూలనపడిందని, అయినా దాన్ని తిరిగి మంజూరు చేయించేందుకు ప్రయత్నిస్తానని స్పష్టం చేశారు. పదేళ్ళు ఎంపీగా వున్న మిథున రెడ్డి ప్రజల కోసం ఒక్క పని కూడా చేయించలేదని విమర్శించారు. కాగా బీజేపీలో చేరినవారిలో భవనేశ్వరి సత్య నాయ కత్వంలో శ్రీకాంత, జయకు మార్‌, సుబ్రమణ్యం, భాస్కర్‌, తనోజ్‌, వెంకట్రమణ, చంద్రశేఖర్‌, రెడ్డిప్రసాద్‌, జ్యోతిప్రకాష్‌, రెడ్డిశేఖర్‌, లోకేష్‌, వెంకటేశు ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com