ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టాటాలతో మస్క్ బిగ్ డీల్.. టెస్లా కోసం భారత్‌లో సెమీకండక్టర్ల తయారీ

business |  Suryaa Desk  | Published : Wed, Apr 17, 2024, 07:17 PM

ప్రపంచ దిగ్గజ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా, మన దేశంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ భారత్‌లో పర్యటించనున్నారు. ఆయన పర్యటనతో భారత్‌లో టెస్లా అరంగేట్రంపై ప్రకటన ఉంటుందని అంతా భావిస్తున్నారు. ఈ తరుణంలోనే కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎలక్ట్రిక్ కార్లలో వినియోగించే సెమీ కండక్టర్ చిప్‌ల తయారీ కోసం మస్క్ నేతృత్వంలోని టెస్లా కంపెనీ.. దేశీయ కార్పొరేట్ దిగ్గజం టాటా సన్స్ అనుబంధ సంస్థ అయిన టాటా ఎలక్ట్రానిక్స్ మధ్య కీలక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే టెస్లా కార్లలో వాడే సెమీ కండక్టర్ చిప్‌లను టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీ సరఫరా చేయనున్నట్లు తెలుస్తోంది.


ఎలాన్ మస్క్ ఈ నెల 22- 27 తేదీల మధ్య భారత్‌లో పర్యటించనున్నారని సమాచారం. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం అవుతారు. మస్క్ తన భారత పర్యటనలో దేశంలో టెస్లా మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు పై ప్రకటన చేస్తారని వార్తలు వస్తున్నాయి. తయారీ యూనిట్, బ్యాటరీ స్టోరేజీ ప్లాట్ ఏర్పాటు చేయాలని టెస్లా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం టెస్లా రూ.16 వేల కోట్ల నుంచి రూ.25 వేల కోట్లు వరకు పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని జాతీయ మీడియాల్లో వార్తలు వచ్చాయి.


సెమీకండక్టర్ తయారీ నేపథ్యంలో టాటా గ్రూప్ గ్లోబల్ క్లయింట్లను సంపాదించే పనిలో పడింది. అందులో భాగంగానే టెస్లాతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. సెమీకండక్టర్ చిప్ సరఫరా కోసం జరిగిన ఈ ఒప్పందం విలువ ఎంత అనేది ఇరు కంపెనీలు ఎలాంటి ప్రకటనలు చేయలేదు. మరోవైపు.. మస్క్ భారత్ పర్యటనలో భాగంగా దాదాపు 2-3 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ప్రకటించనున్నట్లు కంపెనీ వర్గాల సమాచారం. అలాగే దేశంలో తమ ఉత్పత్తుల తయారీ కోసం రిలయన్స్ తో జాయింట్ వెంచర్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకునేందుకు అవకాశాలను పరిశీలిస్తోందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com