ధర్మవరం పట్టణానికి చెందిన వైకాపా నాయకుడు మున్సిపాలిటీ కాంట్రాక్టర్ ఇనయ్ తుల్లా మంగళవారం అనారోగ్యంతో మృతి చెందాడు. ఈయన గత కొద్ది సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మంగళవారం ఆరోగ్యం విషమించి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి సన్నిహితుడిగా ఉండి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుండేవాడు.