ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లోక్ సభ ఎన్నికలు...తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు భేటీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 15, 2024, 10:07 PM

లోక్ సభ ఎన్నికల నిర్వహణపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో తెలంగాణ సీఎస్ శాంతికుమారి, ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి సమావేశమయ్యారు. ఎన్నికల నేపథ్యంలో మరింత సమన్వయంతో పనిచేయాలని ఇద్దరు సీఎస్‌లు నిర్ణయించారు. సరిహద్దు జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. పోలింగ్ ముగిసే వరకు పకడ్బందీగా వ్యవహరించాలని నిర్ణయించామన్నారు. అక్రమ మద్యం, డ్రగ్స్ రాకుండా సరిహద్దుల్లో అప్రమత్తం చేశామన్నారు. గోవా, కర్ణాటక నుంచి మద్యం రాకుండా సరిహద్దుల్లో నిఘా ఏర్పాటు చేశామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com