ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుడి వెనుక ఉన్న రేకుల షెడ్డులో వింత శబ్దాలు.. వెళ్లి చూసిన రైతు షాక్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 14, 2024, 09:39 PM

 అనకాపల్లి జిల్లాలో భారీ కింగ్ కోబ్రా స్థానికులను హడలెత్తించింది. సుమారు 12 అడుగుల పొడవు ఉన్న గిరినాగు ఓ పశువుల కొట్టంలోకి ప్రవేశించింది. గుడివెనుక ఉన్న పశువుల పాకలోకి దూరిన కింగ్ కోబ్రా.. అక్కడే మకాం వేసింది. అయితే పశువులను మేపేందుకు వెళ్లిన రైతు ఈ గిరినాగును గుర్తించారు. పశువుల కొట్టం నుంచి శబ్దాలు వస్తుంటే.. వెళ్లి చూసిన రైతు షాక్ తిన్నారు.12 అడుగుల పొడవున్న గిరి నాగు కనిపించడంతో భయపడిపోయారు. వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించగా.. వారు వచ్చి దీనిని బంధించారు.


అనకాపల్లి జిల్లా మాడుగులలోని మోదమాంబ అమ్మవారి ఆలయ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఆలయానికి దగ్గరలోనే కొండలరావు అనే రైతు రేకుల షెడ్ వేసుకున్నాడు. అందులోనే పశువులను మేపుతున్నారు. అయితే ఎలా చేరిందో తెలియదు కానీ ఓ కింగ్ కోబ్రా ఇందులోకి ప్రవేశించింది. ఆకలితో ఉన్న కింగ్ కోబ్రా ఆహారాన్ని వెతుక్కుంటూ వచ్చి పశువుల పాకలోకి దూరింది. అయితే ఉదయమే పశువుల కొట్టంలోకి వెళ్లిన కొండలరావు బుస్ బుస్ మని శబ్దాలు వస్తుంటే ఏమైందా అని పరిశీలించాడు. అప్పుడే అతనికి బుసలు కొడుతున్న గిరి నాగు దర్శనమిచ్చింది. దీంతో కంగారుపడిపోయిన కొండలరావు స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు.


కొండలరావు ఇచ్చిన సమాచారంతో ఫారెస్ట్ సిబ్బంది, స్నేక్ క్యాచర్ వెంకటేష్ అక్కడకు చేరుకున్నారు. సుమారు అరగంట పాటు శ్రమించి గిరినాగును బంధించారు. అనంతరం రామచంద్రాపురం సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలేశారు. దీంతో స్థానికులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ గిరినాగు 12 అడుగుల పొడవు.. 8 కేజీల బరువు ఉన్నట్లు ఫారెస్ట్ సిబ్బంది తెలిపారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com