వలంటీర్లు ఉద్యోగం గోనే సంచులు మోసే ఉద్యోగమని చంద్రబాబు అన్నారని సజ్జల తెలిపారు. చంద్రబాబు, పవన్ చేసిన వ్యాఖ్యలు ఎలా మర్చి పోతారంటూ మండిపడ్డారు. వలంటీర్లను తీసేసి.. జన్మభూమి కమిటీలను మళ్ళీ తీసుకు వస్తారన్నారు. గొడవలు మొదలు పెట్టింది టీడీపీ అని.. అక్కడ ఏదైనా జరిగితే ఆ నింద మా మీద వేస్తున్నారన్నారు. రేపు వచ్చే తీర్పు కోసం టీడీపీ సాకులు వెదుకుతోందన్నారు. ఎన్నికల కోడ్ వచ్చాక తమ పైనే ఎక్కువ కేసులు పెట్టారన్నారు. తమ అభ్యర్థులను ఎందుకు మారుస్తామని సజ్జల ప్రశ్నించారు. టీడీపీ, బీజేపీ, జనసేనలో గందరగోళం ఉందని సజ్జల పేర్కొన్నారు.