ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు ఇంటర్ ఫలితాల విడుదల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 11, 2024, 05:59 PM

ఆంధ్రప్రదేశ్  లో ఇంటర్ ఫలితాల విడుదలపై అధికారులు కీలక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 12న (శుక్రవారం) ఉదయం 11 గంటలకు తాడేపల్లిలో ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకేసారి విడుదల చేస్తారు. ముందుగా ఈ నెల 15న ఫలితాలు విడుదల చేస్తారని సమాచారం రాగా, తాజాగా 12న ఫలితాలు విడుదల చేయనున్నట్లు అధికారులు క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం, మార్కుల స్కానింగ్‌ ప్రక్రియ పూర్తైంది. మూల్యాంకనాన్ని మరోసారి పరిశీలించి ఫలితాలు విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థులకు మార్చి 1 నుంచి 20వ తేదీ మధ్య పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మందికి పైగా విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది ముందుగానే ఫలితాలు విడుదల చేయనున్నారు. మార్చి నెలలోనే ఇంటర్, పదో తరగతి పరీక్షలు ముగిశాయి. ఫలితాల విడుదల అనంతరం ఇంటర్ విద్యార్థులు https://bieap.apcfss.in/Index.do లో చెక్ చేసుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com