తూర్పుగోదావరి జిల్లాలోని నిడదవోలులో ఎన్డీయే కూటమి ఎన్నికల ప్రచార సభ జరిగింది. టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొన్నారు. వైసీపీ అరాచక పాలనకు అంతం పలికే సమయం దగ్గరపడిందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డీయే కూటమిని గెలిపించాలని కోరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ.. రాష్ట్రంలో దుష్టపాలన పోవాలని ప్రజలంతా కోరుకుంటున్నారన్నారు. ఐదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన వైసీపీ అతిపెద్ద ప్రకృతి వైపరీత్యామని, దాంతో రాష్ట్రం కుదేలైందని విమర్శించారు. రాష్ట్రం అప్పులో ఊబిలో కూరుకుపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు లేవన్నారు. ఈ పరిస్థితుల్లో ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని ఆమె కోరారు.