రైలులో ప్రయాణం చేస్తూ అదుపుతప్పి కిందపడి ఓ యువకుడు మృతి చెందినట్లు జీఆర్పి ఎస్సై మహేంద్ర సోమవారం తెలిపారు. ఘోరఖ్ పూర్ కు చెందిన విశాల్ గోసై (24)అను యువకుడు ఆదివారం రాత్రి కోయంబత్తూర్ నుంచి ముంబాయి కి వెళుతుండగా గుంతకల్లు సమీపంలో గూల్యపాలెం వద్ద అతను రైలు నుంచి కిందపడడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతిదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు