ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతులకు అలర్ట్.. అకౌంట్లోకి రూ. 2 వేలు.. పీఎం కిసాన్ 17వ విడత వచ్చేది ఎప్పుడంటే

national |  Suryaa Desk  | Published : Mon, Apr 08, 2024, 07:30 PM

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ స్కీమ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం. రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించిన స్కీమ్. చిన్నపాటి భూమి కలిగి ఉన్న సన్నకారు రైతుల్ని ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు ఈ స్కీంను తీసుకొచ్చింది కేంద్రం. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. ఈ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ. 6 వేలు అందిస్తోంది. అయితే దీనిని ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇస్తోంది. ప్రతి నాలుగు నెలలకు ఓసారి రూ. 2 వేల చొప్పున 3 విడతల్లో అందిస్తోంది. డబ్బుల్ని నేరుగా రైతుల అకౌంట్లలోనే వేస్తుంది. ఇప్పటివరకు కేంద్రం.. 16 విడతల్లో మొత్తం ఒక్కొక్కరికి రూ. 32,000 అందించింది.


>> ఇప్పుడు 17వ విడత నిధుల కోసం ఎదురుచూస్తున్నారు రైతులు. చివరిసారిగా 16వ విడత నిధుల్ని ప్రధాని మోదీ.. ఫిబ్రవరి 28న మహారాష్ట్ర యావత్మాల్ వేదికగా విడుదల చేశారు. అప్పుడు 9 కోట్ల మందికిపైగా రైతులు ఈ స్కీం ద్వారా ప్రయోజనం పొందారు.


>> అయితే 17వ నిధులు ఇప్పుడు మే ఆఖరి వారంలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ మే ఆఖరి వారం లేదా జూన్ తొలి వారంలో అకౌంట్లోకి డబ్బులు పడతాయని తెలుస్తోంది.


>> అయితే ఇ-కేవైసీ పూర్తి చేసిన రైతులకు మాత్రం 17వ విడత డబ్బులు పడతాయని తెలుస్తోంది. కేంద్రం.. ఎప్పుడూ ఇ-కేవైసీని తప్పనిసరి చేసింది. కేవైసీ పూర్తి చేసేందుకు ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లొచ్చు. అక్కడ ఆధార్ కార్డు ఇవ్వడం ద్వారా దీనిని పూర్తి చేయొచ్చు. ఇంకా.. pmkisan.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా కూడా కేవైసీ చేసుకోవచ్చు. PM Kisan GOI App ద్వారా కూడా ఫేస్ అథెంటికేషన్‌తోనే కేవైసీ పూర్తి చేయొచ్చు.


ఎలా నమోదు చేసుకోవాలి..?


ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.


ఫార్మర్స్ కార్నర్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.


తర్వాత న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది.


ఆ తర్వాత రూరల్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ లేదా అర్బన్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఎంచుకోవాలి.


ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ ఎంటర్ చేసి.. రాష్ట్రం పేరు ఎంచుకొని.. గెట్ ఓటీపీపై క్లిక్ చేయాలి.


తర్వాత మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి.


రాష్ట్రం, జిల్లా, బ్యాంక్ డీటెయిల్స్, ఇతర పర్సనల్ డీటెయిల్స్ అడిగిన సమాచారం ఎంటర్ చేయాలి.


తర్వాత ఆధార్ కార్డు ధ్రువీకరణ పూర్తి చేయాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com