ట్రెండింగ్
Epaper    English    தமிழ்

183 పరుగులు చేసిన ఆర్సీబీ

sports |  Suryaa Desk  | Published : Sat, Apr 06, 2024, 10:01 PM

ఐపీఎల్‌లో భాగంగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్లు మధ్య మ్యాచ్ జరుగుతుంది. జైపూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 183 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో కోహ్లీ సెంచరీ నమోదు చేశాడు. విరాట్ కోహ్లీ 113 పరుగులు చేసాడు. కోహ్లీకి ఐపీఎల్ కెరీర్ లో ఇది 8వ సెంచరీ. డుప్లెసిస్ 44, మ్యాక్స్ వెల్ 1, సౌరవ్ చౌహాన్ 9 పరుగులు చేశారు.రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో చహల్ కు 2, నాండ్రే బర్గర్ కు 1 వికెట్ లభించాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com