ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెండు బైకులు ఢీకొని ముగ్గురి మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 29, 2024, 10:46 AM

విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం కొట్టక్కి వద్ద జాతీయ రహదారిపై గురువారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఎస్‌ఐ జ్ఞానప్రసాద్‌ కథనం మేరకు.. రామభద్రపురం మండలం జన్నివలస గ్రామానికి చెందిన జొన్నాడ పురుషోత్తం (25), జి.రాంప్రసాద్‌, జి.గణేష్‌ గురువారం రాత్రి 8.30 గంటల సమయంలో సాలూరు నుంచి బైక్‌పై స్వగ్రామానికి వస్తున్నారు. సాలూరు గొల్లవీధికి చెందిన జి.శ్రీను (45), యశోద కృష్ణ (47) రామభద్రపురం వైపు నుంచి ద్విచక్రవాహనంపై సాలూరు వెళ్తున్నారు. ఈ క్రమంలో కొట్టక్కి వద్ద జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలూ ఢీకొన్నాయి. పురుషోత్తం తలకు తీవ్రగాయాలు కావడంతో ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. శ్రీను, యశోద కృష్ణ సాలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గణేష్‌, రాంప్రసాద్‌ తీవ్ర గాయాలతో విజయనగరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సంఘటన స్థలాన్ని బొబ్బిలి డీఎస్పీ శ్రీనివాసరావు, రూరల్‌ సీఐ తిరుమలరావు పరిశీలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com