కర్ణాటకలోని మాండ్యా జిల్లా నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని జనతాదళ్ (సెక్యులర్) నాయకుడు హెచ్డి కుమారస్వామి మంగళవారం ధృవీకరించారు. కర్ణాటకలోని మాండ్య పార్లమెంట్ స్థానం నుంచి తాను పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. బీజేపీతో పొత్తులో భాగంగా తమ పార్టీ మాండ్య, కోలార్, హాసన్ స్థానాల నుంచి పోటీ చేస్తుందని కుమారస్వామి ప్రకటించారు. నామినేషన్ రోజున నామినేషన్ దాఖలు చేసి ఆ తర్వాత రాష్ట్రంలో పర్యటిస్తానని ఆయన చెప్పారు. 2024లో కర్ణాటక లోక్సభ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. మొదటి దశ ఓటింగ్ ఏప్రిల్ 26న, రెండో దశ మే 7న జరగనుంది. మాండ్యాలో తొలి దశలో పోలింగ్ జరుగుతుంది.