ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రతిపక్షాలు కార్యకర్తలని నమ్మడం లేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 23, 2024, 03:33 PM

తెలుగుదేశం, జనసేన అభ్యర్థుల్లో ఎక్కువ మంది మాజీ వైయ‌స్ఆర్‌సీపీ నేతలే అని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి సెటైర్లు వేశారు. వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల‌కు టికెట్లు ఇస్తూ టీడీపీ, జనసేన పార్టీలు తమ కేడర్‌లోని నాయకులను ఎందుకు ప్రోత్సహించడం లేదని ఆ పార్టీల నేత‌లే రోడ్ల‌పైకి వ‌స్తున్నార‌ని గుర్తు చేశారు. అలా సొంత నాయకత్వాన్ని ప్రోత్సాహించటానికి ప్రతిపక్షాలు ఎందుకు భయపడుతున్నాయ‌ని విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌శ్నించారు. వారు తమ కార్యకర్తలను ఎందుకు నమ్మటంలేద‌న్నారు. వచ్చే ఎన్నికలు వైయ‌స్ఆర్‌సీపీ, ఫిరాయింపుదారుల మధ్య పోటీలాగా కనిపిస్తోంద‌ని ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి అభిప్రాయ‌ప‌డ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com