తెలుగుదేశం, జనసేన అభ్యర్థుల్లో ఎక్కువ మంది మాజీ వైయస్ఆర్సీపీ నేతలే అని వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. వైయస్ఆర్సీపీ నేతలకు టికెట్లు ఇస్తూ టీడీపీ, జనసేన పార్టీలు తమ కేడర్లోని నాయకులను ఎందుకు ప్రోత్సహించడం లేదని ఆ పార్టీల నేతలే రోడ్లపైకి వస్తున్నారని గుర్తు చేశారు. అలా సొంత నాయకత్వాన్ని ప్రోత్సాహించటానికి ప్రతిపక్షాలు ఎందుకు భయపడుతున్నాయని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. వారు తమ కార్యకర్తలను ఎందుకు నమ్మటంలేదన్నారు. వచ్చే ఎన్నికలు వైయస్ఆర్సీపీ, ఫిరాయింపుదారుల మధ్య పోటీలాగా కనిపిస్తోందని ఎంపీ విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు.