గుంతకల్లు పట్టణంలోని శ్రీ శంకరానంద గిరి స్వామి డిగ్రీ కళాశాలలో వాణిజ్య విభాగం అధ్యాపకుడుగా పని చేస్తున్న కృష్ణానంద స్వామి డాక్టరేట్ పొందడంతో శుక్రవారం కళాశాలలో అభినందన సభ నిర్వహించారు. కళాశాల కరస్పాండెంట్ కేసి. హరికుమర్, ప్రిన్సిపల్ గోపాల్, అధ్యాపకులు ఆయనను శాలువాతో సన్మానించారు. యూపిలో చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ ప్రదానం జరిగినట్లు ప్రిన్సిపల్ తెలిపారు.