ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్రమసంబంధం తో భార్యని చంపిన భర్త

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 20, 2024, 01:10 PM

కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో అక్రమ సంబంధం నేపథ్యంలో జంట హత్యలు వెలుగు చూశాయి. గ్రామానికి చెందిన పెండ్యాల లోవమ్మ అనే మహిళ గత కొంతకాలంగా లోక నాగబాబు అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఇటీవల పోసిన శ్రీను అనే వ్యక్తితో లోవమ్మ అక్రమ సంబంధం పెట్టుకుంది. విషయం కాస్తా నాగబాబుకి తెలిసింది. దీంతో వారిద్దరూ కలిసి ఉండగా.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని శ్రీను, లోవమ్మలపై కత్తితో పొడిచి చంపేశాడు. అక్రమ సంబంధానికి సహకరించిందనే ఉద్దేశంతో పెండ్యాల లోవమ్మ తల్లి విసరపు రామలక్ష్మిపై కూడా నాగబాబు దాడి చేశాడు. రామలక్ష్మి తీవ్రంగా గాయపడగా ఆమెను స్థానికులు కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com