ఆత్మకూరు మండల పరిధిలోని వై. కొత్తపల్లి గ్రామానికి చెందిన మలరాయుడు అనే వ్యక్తి సోమవారం వడదెబ్బతో మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు. పని మీద ఆత్మకూరుకు వచ్చిన ఆయన ఆస్పత్రి వద్దకు చేరుకుని ఓ బండి వద్ద జ్యూస్ తాగి కాసేపు కూర్చొన్నారు. ఉన్నట్టుండి పక్కకు ఒరిగిపోయాడు. విషయం తెలుసుకున్న బంధువులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. అప్పటికే వడదెబ్బ సోకి మృతి చెందినట్లు నిర్ధారించారు.