ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీమిండియాకు అరుదైన ఘనత

Life style |  Suryaa Desk  | Published : Sun, Mar 10, 2024, 09:53 AM

భారత క్రికెట్ జట్టు అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు ఆడిన 579 టెస్టు మ్యాచ్‌‌ల్లో టీమిండియా178 మ్యాచ్‌లు గెలిచి మరో 178 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. దీంతో టీమిండియా 92 ఏళ్ల చరిత్రలో మొదటిసారి గెలుపు, ఓటముల నిష్పత్తి సమానం అయింది. మరోవైపు 222 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.
ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1తో భారత్ గెలుచుకుంది. ఈ సిరీస్‌ మొత్తం అద్భుత ప్రదర్శన చేసిన భారత యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌‌ను ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డు వరించింది. మొత్తం 9 ఇన్నింగ్స్‌ల్లో 712 పరుగులు చేశాడు. ఐదో మ్యాచ్‌లో 9 వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్‌కు ‘ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com