ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపే మ్యాచ్.. ధర్మశాల పిచ్‌ ఇలా!

sports |  Suryaa Desk  | Published : Wed, Mar 06, 2024, 01:37 PM

ఇంగ్లాండ్-భారత్ మధ్య రేపు చివరి టెస్ట్ మ్యాచ్ జరుగునుంది. మ్యాచ్ జరిగే ధర్మశాలలో చల్లటి వాతావరణ పరిస్థితుల కారణంగా పిచ్‌ సీమర్లకు అనుకూలంగా ఉంటుంది. ఆ తర్వాత స్పిన్నర్ల ప్రభావం కనిపిస్తుంది. ఇక్కడ 2017లో జరిగిన ఏకైక టెస్టులో భారత్‌. ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అప్పుడు స్పిన్నర్లు కీలకపాత్ర పోషించారు. అరంగేట్రం చేసిన కుల్‌దీప్‌ నాలుగు వికెట్లతో ఆకట్టుకున్నాడు.
3-1 తేడాతో ఇంగ్లాండ్‌పై టెస్ట్ సిరీస్‌ను గెలుచుకున్న టీమిండియా ఇక ఆఖరి టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ఈ నెల 7న ధర్మశాలలోని HPCA స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలో భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టారు. కెప్టెన్ రోహిత్, యువ సంచలనం జైస్వాల్, గిల్ నెట్స్‌లో చెమటోడ్చుతూ కనిపించారు. మరో వైపు ఇంగ్లాండ్ ప్లేయర్లు కూడా ప్రాక్టీస్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com