ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్నికల వేళ అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై రమేష్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 27, 2024, 01:51 PM

పర్చూరు మండల పరిధిలోని దేవరపల్లి గ్రామ ప్రజలకు పర్చూరు ఎస్సై ఎస్. రమేష్ సోమవారం రాత్రి అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. రానున్న ఎన్నికలో శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని గ్రామస్తులను హెచ్చరించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అపరిచిత వ్యక్తులకు ఓటీపీలు చెప్పవద్దని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు గ్రామంలో కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com