ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వారి ఉసురు నీకు తగులుతుంది జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 23, 2024, 05:48 PM

సీఎం జగన్‌రెడ్డికి పేదల ఉసురు తగిలి రాబోయే ఎన్నికల్లో వైసీపీ కనుమరుగు కావడం ఖాయమని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు. గృహ నిర్మాణంపై ప్రభుత్వానికి పుల్లారావు శుక్రవారం నాడు సెల్ఫీ ఛాలెంజ్‌ విసిరారు. టిడ్కో ఇళ్ల వద్ద టీడీపీ - జనసేన నాయకులతో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ హయంలో రికార్డు స్థాయిలో గృహనిర్మాణాలు జరిగాయని తెలిపారు. టిడ్కో ఇళ్ల సముదాయంలో అన్ని వసతులు ఆనాడే కల్పించామని చెప్పారు. వైసీపీ పాలనలో 500 కుటుంబాలు కూడా ఇళ్లలోకి రాలేదని అన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా టిడ్కో ఇళ్ల సముదాయం మారిందని మండిపడ్డారు. ఐదేళ్లలో వైసీపీ కట్టిన ఇళ్లెన్ని? అవి ఎక్కడ? జవాబు చెప్పగలరా? అని ప్రశ్నించారు. పేదల ఉసురు తగలబట్టే ఆరు నెలల ముందే వైసీపీ నేతలు గుంటూరు పారిపోయారని ప్రత్తిపాటి పుల్లారావు ఎద్దేవా చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com