ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆల్‌టైం గరిష్ఠానికి నిఫ్టీ.. 73,200 పైకి సెన్సెక్స్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 23, 2024, 11:28 AM

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం స్వల్ప లాభాల్లో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ లైఫ్‌ టైమ్ గరిష్టాన్ని తాకింది. ఉదయం 9.20 గంటలకు సెన్సెక్స్ 89.85 పాయింట్ల లాభంతో 72,540.32 వద్ద, నిఫ్టీ 33.85 పాయింట్ల లాభంతో 22,213 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ ప్యాక్ నుంచి టైటాన్, మారుతి, NTPC లాభాల్లో, HDFC, TCS, ఎయిర్‌టెల్ నష్టాల్లో ఉన్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.86 వద్ద ప్రారంభమైంది.
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు మన సూచీలకు దన్నుగా నిలుస్తున్నాయి. ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్‌ 54 పాయింట్ల లాభంతో 73,212 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 17 పాయింట్లు పెరిగి 22,235 దగ్గర కొనసాగుతోంది. ఆరంభంలో ఈ సూచీ 22,297.50 దగ్గర ఆల్‌టైం గరిష్ఠానికి చేరింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com