ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి వైసీపీ ఎప్పటికప్పుడు స్వరం మారుస్తోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన అమరావతి రాజధానిని తిరస్కరించిన ప్రస్తుత వైసిపి ప్రభుత్వం. మూడు రాజధానుల ప్రతిపాదనను అసెంబ్లీలో ప్రవేశపెట్టి మరలా వెనక్కి తీసుకుంది. ఇక ఇప్పుడు ఏపీకి అమరావతే రాజధాని అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
అక్కడితో ఈ వ్యవహారం ఆగలేదు. హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని తాజాగా వైసీపీ సీనియర్ నేత వైవి. సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. ఈ ఐదేళ్ల కాలంలో రాజధానిపై స్పష్టత ఇవ్వని వైసీపీని ప్రజలు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నమ్ముతారో లేదో చూడాలి.